ఒక మేధావి చెప్పినట్లు మనము "కలలు కనాలి ఆ కలలను నిజం చేసుకోవాలి" ఈ మాటలు అందరు ఆచరణలో పెట్టి ఉంటే భావి భారతంలో ఎందరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య లు ఉండేవాళ్ళు ,,,,,,,
కాని మన సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక శతాబ్దికి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాత్రమే పుడతాడు ఎందుకంటే ప్రతి పనిలోనూ అవినీతి అనేది ప్రత్యక్ష మహిషాసుర వేషంలో విలయతాండవం చేస్తోంది .....
ప్రజలలో ప్రతిదానికి భయాన్ని కలిగించే ఈ మహమ్మారిని ఏ దేవుడు వచ్చిన అంతం చేయలేడు ఎందుకంటే భగవంతుడికి కూడా లంచం ఇచ్చి కొనేయ్యాలనే అంతటి అవినీతి దుండగులు ఉన్నారు .....
ప్రతి మనిషిలోను మార్పు రావాలి మనమే మన సమాజాన్ని బంగారు బాటలో కాకపోయినా ముళ్ళ బాటలో మాత్రం నడవకుండా చేయాలని చిన్న విన్నపం నా విన్నప్పాన్ని మన్నిస్తారని ఆసిస్తూ ......
అందరు కలకాలం సంతోషంగా ఉండాలి...

No comments:
Post a Comment